హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు (జూలై 27) 24 గంటలపాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన విడుదల చేసింది. నగర ప్రజలు ముందస్తుగా అవసరమైనంత నీటిని నిల్వ చేసుకోవాలని సూచించింది.
జూలై 27 ఉదయం 10 గంటల నుంచి జూలై 28 ఉదయం 10 గంటల వరకు ఈ అంతరాయం కొనసాగనుంది. మరమ్మతు పనులు పూర్తైన వెంటనే దశలవారీగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఎందుకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారు?
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) పనులను వేగవంతం చేయడానికి ఈ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KWSP) ఫేజ్-2 రింగ్ మెయిన్-2కు చెందిన 1600 మిల్లీమీటర్ల వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్లైన్పై జంక్షన్ పనులు నిర్వహించనున్నారు.
ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే రహదారి ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, ఫ్లైఓవర్లోని P15 ఫౌండేషన్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం లక్ష్యంగా ఈ అత్యవసర పనులు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
జూలై 27 ఉదయం 10 గంటల నుంచి జూలై 28 ఉదయం 10 గంటల వరకు కింది ప్రాంతాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా మంచినీటి సరఫరా నిలిచిపోనుంది.
- ఫతేనగర్
- హస్మత్పేట్
- ప్రకాశ్నగర్
- నాచారం
- హెచ్ఎంటీ నగర్
- బీరప్పగడ్డ
- హబ్సిగూడ
- రామంతాపూర్
- వెంకటరెడ్డి నగర్
- ఉప్పల్
- మేకలమండి
- భోలక్పూర్ (పాక్షికంగా)
- పద్మారావు నగర్
- బన్సీలాల్పేట్
- బౌద్ధనగర్
- తార్నాక (పాక్షికంగా)
- సీతాఫల్మండి
- మెట్టుగూడ
- లాలాపేట్ (పాక్షికంగా)
- నార్త్ లాలాగూడ
- అడ్డగుట్ట
- బాలానగర్
- సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం
- ఎంఈఎస్ పరిధి
- సికింద్రాబాద్ కంటోన్మెంట్
బోర్డు పరిధిలోని ప్రాంతాల ప్రజలకు జలమండలి సూచనలు
నీటి సరఫరా నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందుగానే తాగునీరు, గృహ అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది. అపార్ట్మెంట్లు, ఆసుపత్రులు, హోటళ్లు, వాణిజ్య సముదాయాలు వంటి అధిక నీటి అవసరం ఉన్న ప్రదేశాలు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవసరమైతే జలమండలి కస్టమర్ సర్వీస్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే దశలవారీగా ఆయా ప్రాంతాలకు మంచినీటి సరఫరా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
24 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నందున ప్రజలు ముందుగానే తాగునీరు, వంట, ఇతర గృహ అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.